కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన ఎంపి కావ్య 

 న్యూ ఢిల్లీ,తెలంగాణ ముచ్చట్లు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా, వరంగల్ మామూనూరు విమానాశ్రయాన్ని త్వరగా పూర్తిచేయడంపై ఎంపీ కడియం కావ్య  కేంద్ర మంత్రికి  విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా, రామ్మోహన్ నాయుడు  వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పన, భూ సేకరణ పూర్తి అయిన తరువాత రెండు సంవత్సరాల్లో విమాన రాకపోకలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ పట్టణ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు, నగరాన్ని రాష్ట్ర రెండవ రాజధానిగా అభివృద్ధి చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎయిర్ పోర్ట్ అథారిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్