ప్రభుత్వ వసతి గృహంలో బాలికలను కొరికిన ఎలుకలు 

హాస్టల్ సిబ్బంది పై తల్లిదండ్రుల ఆగ్రహం

ప్రభుత్వ వసతి గృహంలో బాలికలను కొరికిన ఎలుకలు 

వికారాబాద్, నవాబ్‌పేట్తెలంగాణ ముచ్చట్లు:  ప్రభుత్వ వసతి గృహాల్లో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8 మంది విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గత నెల 22న నలుగురు బాలికలను ఎలుకలు కొరికాయి. అయితే ఈ విషయం పట్టించుకోకుండా హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 27న మరో నలుగురు విద్యార్థినులు ఎలుకల దాడికి గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం

తమ పిల్లలు హాస్టల్‌లో సురక్షితంగా లేరని, కనీస వసతులు లేకపోవడంతోపాటు ఎలుకల బెడద తీవ్రంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. బాధ్యత వహించే హాస్టల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పరిస్థితిని సమీక్షించిన అధికారులు

బాలికల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అధికారులు, హాస్టల్‌లో శుభ్రత లోపించిందని గుర్తించారు. హాస్టల్ పరిసరాల్లో ఎలుకలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్