ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలి
పెద్దమందడి ఎంపీడీవో సద్గుణ
వనపర్తి తెలంగాణ ముచ్చట్లు:
ఉపాధి హమీ కూలీల సంఖ్య పెంచాలని ఎంపీడీవో సద్గుణ అన్నారు. మంగళవారం పెద్దమందడి మండల పరిధిలోని ముందరి తండాలో ఉపాధి హామీ పనులు భూమి లెవలింగ్ పనులను ఎంపీడీవో సద్గుణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సద్గుణ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులను కూలీల సంఖ్య పెంచాలన్నారు. రాబోయే వర్షకాలం దృష్టిలో పెట్టుకొని రైతులకు కావలసిన భూమిని లెవలింగ్ పనులను చేపట్టాలన్నారు. ఎండాకాలం కావడంతో ముందు జాగ్రత్తగా కూలీలు కు త్రాగునీరు సమస్య లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో కూడా ముందు జాగ్రత్తగా సమస్య లేకుండా జాగ్రత్తగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో పల్లె ప్రగతి ప్రకృతి వనంలో మొక్కలు పెంచేందుకు బ్రెడ్లు మొక్కలు వేయడానికి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలోనే 5000 నుండి 10000 వరకు మొక్కలు పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు దృష్టి సారించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం చేస్తే తగ్గున చర్యలు చేపడతామన్నారు.
Comments