ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''
మల్కాపూర్ విచారణ గురువు రామంచ శరత్ కుమార్
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని తాటికాయల గ్రామంలో గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేష ఆదరణ పొందాయి. ఫాదర్ రామంచ శరత్ కుమార్ నేతృత్వంలో గ్రామ వీధుల్లో సిలువ మార్గ ప్రదర్శన, ప్రత్యేక ప్రార్థనలు నిర్వధిగా కొనసాగాయి.
ఈ సందర్భంగా ఎర్ర పవన్ కళ్యాణ్ యేసు ప్రభుగా జీవాంతకంగా నటించి, గోల్గతా మార్గంలో ప్రభువు త్యాగాన్ని హృదయంగా ప్రతిబింబించగా, ఈ ప్రదర్శన ప్రజలను భావోద్వేగానికి లోనచేసింది. అనంతరం ఫాదర్ రామంచ శరత్ కుమార్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఫాదర్ రామంచ శరత్ కుమార్, ‘‘యేసు చేసిన అద్భుతాలకు మించినది—ఆయన ప్రేమ. శత్రువులను క్షమించిన గుణం. పాపులను కాదని తిరస్కరించని తత్త్వం. ఇవే నిజమైన ఆధ్యాత్మికతకు మూలస్తంభాలు’’ అని పేర్కొన్నారు.
‘‘ఈ రోజే మనం లోపాల్లోంచి వెలికి రావాలి. అహంకారాన్ని, అసూయను, ద్వేషాన్ని మన గుండెలో శిలువ వేసి తొలగించాలి. మన జీవితాన్ని ఆత్మీయ మార్గంగా మార్చుకోవాలి. మార్పు మనలొ ప్రారంభమైతేనే మన కుటుంబంలోనూ, సమాజంలోనూ శాంతి చేకూరుతుంది’’ అని పిలుపునిచ్చారు.ప్రభువు త్యాగాన్ని స్మరించుకుంటూ, తన మార్గంలో ముందుకు సాగాలన్న సంకల్పంతో ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ఈ రోజు పునాదిగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో ఉపదేశి పట్ల శ్రీనివాస్,సంఘ పెద్దలు పట్ల రాంచందర్,ఎర్ర యాదగిరి,బొల్లెపాక వెంకటస్వామి,ఎర్ర వెంకటస్వామి,పట్ల మీస రాజయ్య,ఎడ్ల యాదగిరి,జీడీ భద్రయ్య,నల్ల రాములు,తాటికాయల గ్రామానికి చెందిన క్రైస్తవులు, సంఘస్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments