మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన హోసన్నా మహిళా సంఘం

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన హోసన్నా మహిళా సంఘం

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో హోసన్నా మహిళా సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరిపింది. మహిళల హక్కులు, సమానత్వం, సామాజిక స్థాయిని పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏడాది నిర్వహించే ఈ దినోత్సవాన్ని సంఘ సభ్యులు ప్రత్యేకంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సభ్యులు కేకు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. మహిళల ప్రాధాన్యతను గుర్తు చేస్తూ, సమాజంలో వారికి మరింత గుర్తింపు రావాల్సిన అవసరంపై చర్చించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు తమవంతు కృషి చేస్తామని సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బొల్లెపాక శ్రీలేఖ, బొల్లెపాక అనిత, ఎర్ర లుధియా, పట్ల సువార్త, నల్ల దీప, పట్ల కవిత,బొల్లెపాక అనూషIMG-20250308-WA0160 తదితరులు పాల్గొన్నారు. మహిళా శక్తిని ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు మరింత ఉపయోగకరమని వారు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్