విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండల కేంద్రములోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి వారికి కేటాయించిన తరగతిలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు రాబోవు పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి పై స్థాయికి వెళ్లాలని వారు కోరారు.ఓక రోజు కలెక్టర్ గా శ్రీలత, జిల్లా విద్యాధికారి నందిని, జిల్లా ఉపవిద్యాధికారి శ్రీదేవి, మండల విద్యాధికారిని మాధురి, ఆర్ .జె.డి సిద్ర, ఫిజికల్ డైరెక్టర్ ప్రవళిక స్వయం పరిపాలన దినోత్సవం ద్వారా ఒకరోజు వారి వారి హోదాలో బాధ్యతలు చేపట్టారుఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాంతన్న, ఉపాధ్యాయులు శాంతన్న, ఫిజికల్ డైరెక్టర్ మన్నెం మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Comments