జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టారు
మాదిగ అమరవీరులకు ఘన నివాళి
Views: 2
On
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలోని మర్లపాడు గ్రామ రింగ్ సెంటర్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.
సభలో పాల్గొన్న జిల్లా నేత కలపాల యేసు మాట్లాడుతూ, జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరవీరుల ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేయాలని, వారి త్యాగాలను మరవకూడదని అన్నారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆరెంపుల సాంబయ్య, మండల అధ్యక్షుడు పింగళి నరేష్, మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, కోటమర్తి బాలస్వామి, కోట వెంకటేశ్వరరావు, సుదిమళ్ల ప్రసాద్, నడ్డి రవి, మరాఠీ రాములు, కొమ్ము విజయ్, ముల్లంగి నాగరాజు, జొన్నలగడ్డ సాయి, సాధు శరత్ బాబు, సాధు రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments