భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
Views: 4
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు: వరకట్న వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఆరు నెలల క్రితం గోవాలో దేవిక (35), సతీష్ వివాహం జరిగింది. రాయదుర్గంలోని ప్రశాంతి హిల్స్ లో నివసిస్తున్న వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని దేవిక మృతి చెందింది.
సోమవారం ఉదయం 10 గంటల సమయంలో దేవిక ఉరివేసుకున్నట్లు గుర్తించిన భర్త సతీష్, పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, భర్త వరకట్న వేధింపులే తన కూతురి మృతికి కారణమని దేవిక తల్లి రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments