డాక్టర్లను కలిసిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం

డాక్టర్లను కలిసిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 30వ తేదీ వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా " నైతికతే నిజమైన స్వేచ్ఛ " అంశంపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా శనివారం నాడు ( రెండో రోజు) కూడా మహిళా విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో పలు ఆస్పత్రులను సందర్శించి డాక్టర్లకు నైతికతే నిజమైన స్వేచ్ఛ అంశంపై స్వచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ మహిళ విభాగం ఖిల్లా అధ్యక్షురాలు ఆస్పియా అంజుమ్ మాట్లాడుతూ మానవులలో నైతిక విలువలు పతనం కావడానికి భయభక్తులు లోపించడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజం నైతిక సంక్షోభంలో చిక్కుకొని అశాంతి , ఆలజడు లకు గురవుతుందన్నారు .సమాజంలో మార్పు కోసం మన అందరం కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉందని చెప్పారు .తాము నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జమాతే ఇస్లామీ హింద్ మహిళ విభాగం క్యాంపెయిన్ కన్వీనర్ హాజీర సదఫ్, సభ్యులు, నూరి హప్ష,ఫైజా ఇరం తదితరులు పాల్గొన్నారు.

జమాఅతె ఇస్లామీ హింద్ ఇంద్రనగర్ శాఖ అధ్యక్షురాలు హుసేన్ బీ. ఆధ్వర్యంలో స్కూళ్లను సందర్శించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను అందించి క్యాంపెయిన్ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. స్కూల్ పిల్లలకు నైతిక విలువల బోధించాలని టీచర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు జహరా ఫాతిమా, మొమినా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్