ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి
-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
Views: 3
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ధాన్యం విక్రయించిన రైతులకు పేమెంట్ విషయంలో ఆలస్యం లేకుండా త్వరగా చెల్లింపులు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు మరియు పేమెంట్ అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, ఆన్లైన్ ప్రక్రియ, రైతులకు పేమెంట్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రావిణ్య మాట్లాడుతూ, రైతుల పేమెంట్ ప్రక్రియ వేగంగా సాగించాలని, అలాగే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సొమ్ము కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Apr 2025 21:58:27
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక
-పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు
-ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని...
Comments