ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి

-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

ధాన్యం విక్రయించిన రైతులకు పేమెంట్ విషయంలో ఆలస్యం లేకుండా త్వరగా చెల్లింపులు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు మరియు పేమెంట్ అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, ఆన్లైన్ ప్రక్రియ, రైతులకు పేమెంట్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ప్రావిణ్య మాట్లాడుతూ, రైతుల పేమెంట్ ప్రక్రియ వేగంగా సాగించాలని, అలాగే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సొమ్ము కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్