ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలి

-హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు : 

ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను  జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

 WhatsApp Image 2024-12-04 at 9.32.42 PM  ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినపనులను కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో చేపట్టిన  తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, ఇతర మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 

 అనంతరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని  కలెక్టర్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి  విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో వాసంతి, డిఆర్డివో మేన శ్రీను, ఎంపీడీవో అనిల్ కుమార్, సంబంధిత శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్