మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన సిపి

హన్మకొండ, తెలంగాణ ముచ్చట్లు: ఆకస్మికంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ భద్రత నుండి మంజూరైన  చెక్కును వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపిఎస్ శనివారం అందజేసారు. వివరాల్లోకి వెళితే  నర్సంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న  జనార్దన్ గత సంవత్సరం సెప్టెంబర్ 7 వ తేదిన అనారోగ్యం తో మరణించాడు. దీనితో తెలంగాణ పోలీస్ భద్రత పథకం ద్వారా మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి మంజూరు చేసిన 7 లక్షల 89 వేల రూపాయల చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు అందజేసారు. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు, శాఖపరంగా రావల్సిన బెనిఫిట్లను అందజేసేందుకు తక్షణ చర్యలు గైకొనాల్సిందిగా పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమములో అదనపు డీసీపీ రవి, పరిపాలన విభాగం ఏవో రామకృష్ణ స్వామి, సెక్షన్ సూపరింటెండెంట్  రమాదేవి, సహాయ సిబ్బంది శ్రవణ్ పాల్గోన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్