రియల్‌మీ తన సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనుంది

రియల్‌మీ తన సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేయనుంది

హైదరాబాద్ తెలంగాణ ముచ్చట్లు:

 320W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కంపెనీ రూపొందించింది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఫోన్ పూర్తి ఛార్జ్ కానుంది.ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ తన కొత్త సూపర్‌సోనిక్ ఛార్జ్ టెక్నాలజీని రేపే ప్రారంభించబోతోంది. ఈ టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ 100 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ ఛార్జింగ్‌ టెక్నాలజీ. దీన్ని కంపెనీ రేపు (ఆగస్టు 14వ తేదీ) తీసుకురానుంది. ఇంతకుముందు కంపెనీ 300W ఫాస్ట్ ఛార్జింగ్‌ను తీసుకురాబోతోందని అందరూ భావించారు. అయితే 320W సూపర్‌ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీని తీసుకురాబోతున్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ టెక్నాలజీ రాకతో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం చాలా వేగవంతం కానుంది.

రియల్‌మీ రూపొందించిన ఈ ఫాస్ట్ ఛార్జర్ గత సంవత్సరం తమ కంపెనీనే ప్రవేశపెట్టిన 240W ఫాస్ట్ ఛార్జ్‌కు టెక్నాలజీ పరమైన అప్‌డేట్ నవీకరణ. రియల్‌మీ గత ఏడాది లాంచ్ చేసిన జీటీ 5 మొబైల్‌తో ఈ ఛార్జింగ్ టెక్నాలజీని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం 80 సెకన్లలోనే 20 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే''  ఏసు క్రీస్తు త్యాగానికి ప్రతీక ''గుడ్ ఫ్రైడే'' 
-తాటికాయలలో భక్తి శ్రద్దలతో గుడ్ ఫ్రైడే వేడుక  -పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవ భక్తులు  -ఆకట్టుకున్న ఏసు క్రీస్తు సిలువ మార్గ ప్రదర్శన   ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని...
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్య జీవము 
 రాజీవ్ యువ వికాసం ప్రతిష్టాత్మక  పథకం 
క్రాంతి కుమార్, దిలీప్‌లకు నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య
మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర
కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
కాంగ్రెస్ పార్టీ తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షులుగా భాస్క రవీందర్